నాగేశ్వరరావు కుటుంబానికి జనసేన ఆర్థిక సాయం

నందిగామ పట్టణం, 16వ వార్డులోగల జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు నిడిగంటి నాగేశ్వరరావు ఇటీవల పలు సమస్యలతో తాళలేక ఆత్మహత్య చేసుకున్నారు. విషయంతెలుసుకున్న జనసేన శ్రేణులు వారి కుటుంబాన్ని పరామర్శించి, సంతాపాన్ని తెలియజేశారు. అనంతరం వారి కుటుంబానికి నియోజకవర్గ పార్టీ నుండి రూ.10,000/- తక్షణ సహాయం అందించారు. నాగేశ్వరరావు పిల్లల చదువుల రీత్యా పార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నందిగామ పట్టణ 20 వ వార్డు కౌన్సిలర్ తాటి వేంకట కృష్ణ, నియోజక వర్గ నాయకులు కామిశెట్టి వెంకటేశ్వర రావు, పట్టణ పార్టీ అధ్యక్షులు తాటి శివ కృష్ణ, పట్టణ పార్టీ వీర మహిళా విభాగం అధ్యక్షురాలు మేకపోతుల శ్రీ లక్ష్మి యాదవ్, ఉపాధ్యక్షులు కొమ్మవరపు నరసింహ స్వామీ, శ్రీనివాస్, వెంకట్, తానూరి సైదులు, ప్రధాన కార్యదర్శి తెప్పలి కోటేశ్వర రావు, వంశీ పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.