షేక్ రియాజ్ ను కలిసిన కనపర్తి మనోజ్ కుమార్

  • మనోజ్ కుమార్ ని అభినందించిన షేక్ రియాజ్
  • వైసీపీ ప్రభుత్వంలో మోసపోయిన ఎస్సీ, ఎస్టీ లకు అండగా పొన్నలూరు మండలంలో ఫిబ్రవరి 4, శనివారం జనసేన పార్టీ నుండి పోరాటం

కొండెపి: ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ ను పొన్నలూరు మండలం అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ గురువారం మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా షేక్ రియాజ్ మాట్లాడుతూ పొన్నలూరు మండలంలో కనపర్తి మనోజ్ కుమార్ ప్రజా సమస్యల మీద అలుపెరగని పోరాటం చేస్తున్నాడు, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, రోజు రోజుకీ పొన్నలూరు మండలంలో జనసేన ప్రజాదరణ పొందటం ఆనందకరం. వైసిపి అరాచకాన్ని ఎండగడుతూ, ప్రజలకు చేరువవుతూ, మండలంలో ఉన్న సమస్యలు ఎప్పటికప్పుడు మా దృష్టికి తీసుకువస్తూ, ఉన్నతమైన చదువు చదివి, ఆ చదువుకున్న జ్ఞానాన్ని ప్రజలకు పంచుతూ ఉండటం, ప్రజా సమస్యల మీద నిత్యం పోరాడుతున్న వ్యక్తి అని షేక్ రియాజ్ మనోజ్ కుమార్ ని అభినందించారు. వైసీపీ ప్రభుత్వంలో దగాపడ్డ మోసపోయిన ఎస్సీ, ఎస్టీలకు అండగా జనసేన పార్టీ ఉంటుంది, ఎస్సీ ఎస్టీలకు మద్దతుగా ఫిబ్రవరి 4, శనివారం పొన్నలూరు మండలం, అగ్రహారం సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్సీ ఎస్టీలకు అండగా ఉంటూ వారి తరఫున పోరాటం చేయడం జరుగుతుంది, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని, విజయవంతం చేయాలని కనపర్తి మనోజ్ కుమార్ తెలియజేశారు.