నిరుపేద కుటుంబానికి జనసేన తోడ్పాటు

శ్రీకాళహస్తి నియోజకవర్గం, రేణిగుంట పట్టణంలోని పద్మానగర్ కి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన మరాఠీ శీను ఇటీవల గుండె జబ్బుతో మరణించడం జరిగింది. గర్భవతి అయిన అతని భార్య శ్రీమతి మరాఠీ మీనాను గురువారం నియోజకవర్గ నియోజకవర్గ జనసేన ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా వారి ఇంటికి వెళ్లి పరామర్శించి, 2 నెలలకి సరిపడా బియ్యం, నిత్యావసర వస్తువులు మరియు కూరగాయలు ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో ఏ అవసరం ఉన్న జనసేన అండగా ఉంటుందని బరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు బాలాజీ, భాగ్యలక్ష్మి, త్యాగరాజులు, రాజా రాయల్, జ్యోతి కుమార్, నాథముని, గాంధీ తదితరులు పాల్గొన్నారు.