మల్లాడి సత్యలింగ నాయకర్ కు ఘన నివాళులు

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కాకినాడ సిటీ ఇన్ ఛార్జ్ మరియు రాష్ట్ర పీఏసీ సభ్యులు ముత్తా శశిధర్ ఆలోచనలతో శుక్రవారం ఉదయం 8.30 గంటలకు ఎం.ఎస్.ఎన్ చారిటీస్ లో స్వర్గీయ మల్లాడి సత్యలింగ నాయకర్ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలతో నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 21 డివిజన్ అధ్యక్షులు మండపాక దుర్గాప్రసాద్ మాట్లాడుతూ మల్లాడి సత్యలింగ నాయకర్ మహాదాత మహా విద్యాదాత అని వారు చేసిన సేవలు మరువలేనివని ఆయన పేద విద్యార్థులు ఎవరూ చదువుకోకుండా ఉండకూడదని కొన్ని వేల ఎకరాలు దానం చేశారని ఆ ఎకరాలు ప్రభుత్వం పాలు కాకుండా ఒక ట్రస్ట్ ను ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ లోని పెద్ద విద్యార్థులు చదువుకోవాలని వాళ్ళు ఉన్నత చదువు చదివిస్తూ వాళ్లకు స్కాలర్షిప్ లిస్ట్ అందరి భవిష్యత్తు బాగుండాలని ఆయన ముందు జాగ్రత్తగా కొన్ని వేల ఎకరాలు దానం చేయడం జరిగిందని పేర్కొన్నారు. 21 డివిజన్ కమిటీ సభ్యులు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు, వీరమహిళలు పాల్గొన్నారు.