మానవత్వం చాటిన జనసేన యువత

ఇచ్చాపురం మండలం ముచ్చంద్ర పంచాయతీ బన్నీగానిపేట గ్రామానికి చెందిన గుడియా అర్జున్ సాహు గత ఐదు సంవత్సరాలు కిందట ఎలక్ట్రికల్ షాక్ వల్ల అతని కాలు పోయింది. తను ఉండటానికి ఇల్లు కూడా లేక చాలా కష్ట కాలంలో ఉన్నారు. తనకి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు లేక ఒక రేకు ఇంట్లో ఉంటున్నారని తెలుసుకొని తిప్పన దుర్యోధన రెడ్డి కమలాయిపుట్టుగా జనసేన యువతకి తెలియజేయగా వాళ్ళు మంచి మనసుతో స్పందించి తనని ఇల్లు కట్టుకోమని ఆదివారం 8000 రూపాయలు ఆర్థిక సాయం చేయటం జరిగింది. ఇచ్చాపురం నియోజకవర్గం ఇన్చార్జి దాసరి రాజు మరియు రాష్ట్ర జాయింట్ సెక్రటరీ తిప్పన దుర్యోధన రెడ్డి చేతుల మీదుగా అందించటం జరిగింది. ఈ కార్యక్రమంలో కమలాయపుట్టిగా జనసైనికులు, ముచ్చంద్ర ఎంపిటిసి అభ్యర్థి శంకర్ రెడ్డి, కేదారిపురం యూత్ లీడర్ పవర్ రాజా, నూకరాజు, మోహన్, రాము తదితరులు పాల్గొన్నారు.