మొగల్తూరు గ్రామ పంచాయితీలో బొమ్మిడి నాయకర్ పాదయాత్ర

జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా నరసాపురం నియోజకవర్గం, మొగల్తూరు మండలం, మొగల్తూరు గ్రామ పంచాయితీ, పాలకమ్మ చెరువు దగ్గర నరసాపురం నియోజకవర్గ జనసేన ఇంచార్జి, పీఏసీ సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ ఛైర్మెన్ బొమ్మిడి నాయకర్ పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రలో భాగంగా గ్రామంలోని సమస్యలను తెలుసుకున్న నాయకర్ మాట్లాడుతూ డ్రైనేజీ వ్యవస్థ లేనందున ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, అలాగే త్రాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు మరియు సరైన రోడ్లు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొల్లాటి గోపీకృష్ణ, ఆకన చంద్రశేఖర్, వాతాడి కనకరాజు, వలవల నాని, బందెల రవీంద్ర, గుబ్బల మార్రాజు, అయితం చిన్ని, ఉప్పులూరి రాంబాబు, ఆముదాలపల్లి రాంబాబు, దూది బాబు, బొక్కా చంటి, లక్కు బాబి, కొప్పాడి నాగరాజు, బందెల ఎలీషా, గుడపాటి శ్రీకాంత్, నల్లి నాగరాజు, కొల్లాబత్తుల మహేష్, యాకోబు, ముక్కు గిరి, పిప్పళ్ళ రామకృష్ణ, అందే రంగబాబు, కొండేటి తాతాజీ, గజ్జరపు మురళి వెంకట ఫణి మరియు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు, పాలకమ్మ చెరువు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.