సుంకర శ్రీ మహాలక్ష్మిని సత్కరించి అభినందనలు తెలియజేసిన ముత్తా శశిధర్

జనసేన పార్టీ రాష్ట్ర పీఏసీ సభ్యులు మరియు కాకినాడ సిటీ ఇన్చార్జ్ ముత్తా శశిధర్ ఆదేశాల మేరకు సుంకర సురేష్ ఆధ్వర్యంలో జనవరి 26 గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఢిల్లీలో జరిగిన వేడుకల్లో ఎన్సీసీ పెరేడ్ క్యాంపెయిన్ లీడ్ గా కాకినాడకు చెందిన సుంకర శ్రీ మహాలక్ష్మి బెస్ట్ క్యాంపెయిన్ గర్ల్ అవార్డు గెలుపొందడం జరిగింది. ఈ అవార్డుని ప్రెసిడెంట్ ద్రౌపతి చే తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సుంకర శ్రీ మహాలక్ష్మిని సత్కరించి అభినందనలు తెలియజేయడం జరిగింది. కాకినాడకి చెందిన మహిళ ఇలా బెస్ట్ క్యాంపెయిన్ గర్ల్ గా అవార్డు సాధించడం యావత్ కాకినాడ ప్రజలందరికీ గర్వం కారణం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, చీకట్ల వాసు, ఫణీంద్ర నాయుడు, హైమా, మనోహర్లాల్ గుప్తా, అవులూరి సురేష్ మరియు జన సైనికులు, వీర మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.