జనసేన జెండా మోసిన ప్రతి కార్యకర్తకి, వారి కుటుంబానికి అండగా నిలబడతాం: గాదె

బాపట్ల నియోజకవర్గం బాపట్ల టౌన్(వార్డ్ 13)లో విన్నకోట వీధికి చెందిన జనసైనికుడు దండా ప్రదీప్ కుమార్ బైక్ ప్రమాదానికి గురైనాడు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు వెంటనే రాష్ట్ర కార్యాలయానికి తెలియజేసారు. జనసేనపార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ క్రియాశీల సభ్యత్వం కలిగి ఉన్న జనసైనికుడికి తక్షణం ఆర్ధిక సహాయంగా 46,331/- ల చెక్కుని జిల్లా అధ్యక్షులకు పంపడం జరిగింది. సోమవారం గాదె వెంకటేశ్వరరావు దండా. ప్రదీప్ ఇంటికి వెళ్లి వారి కుటుంభసభ్యులను కలసి వారికీ ఆ చెక్ ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా గాదె మాట్లాడుతూ.. మన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ కార్యకర్తలకు, జనసైనికులకు ఎప్పుడూ అండగా ఉంటారు కానీ ఇలాంటి ప్రమాదాలు జరగకూడదు అని ఆయన ఎపుడూ అంటుంటారు అని తెలియజేసారు. రేపు ఫిబ్రవరి 10వ తారీకు నుంచి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం మూడో విడత మొదలవుతుంది. కాబట్టి జనసేన పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ క్రియాశీలక సభ్యత్వాన్ని తీసుకోవాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అడపా మాణిక్యాలరావు, నారదాసు రామచంద్ర ప్రసాద్, శివన్నారాయణ, తులసి కుమారి, మేకల రామయ్య యాదవ్, తాళ్లూరి అప్పారావు నాయకులు, వీరమహిళలు పాల్గొన్నారు.