కూకట్పల్లి నియోజకవర్గ జనసేన నాయకుల భేటీ
కూకట్పల్లి నియోజకవర్గ జనసేన కార్యనిర్వాహకులు నడిగడ్డ నాగేంద్రబాబు ఆధ్వర్యంలో కూకట్పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు మంగళవారం జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ ని కలవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ పోటీ చేయటానికి సిద్ధమైన తరుణంలో ఈ భేటీ ప్రాముఖ్యతను సంతరించుకుంది. కూకట్పల్లి నియోజకవర్గం పార్టీ బలోపేతానికి వివిధ రకమైన కార్యాచరణను సిద్ధం చేయడం జరిగింది. జనసేన పార్టీ నాయకుల భేటీలతో నియోజకవర్గంలోని జనసేన పార్టీ క్యాడర్ ని ఆక్టివ్ చేయడం జరుగుతుంది. రానున్న రోజుల్లో కూకట్పల్లిలో జనసేన పార్టీ పోటీ చేస్తే, కూకట్పల్లి నియోజకవర్గ రాజకీయ ముఖచిత్రం మారే అవకాశం ఎంతగానో కనిపిస్తుంది. ఈ భేటీలో జనసేన పర్యవేక్షకులు దామోదర్, కెపిహెచ్బి డివిజన్ అధ్యక్షులు కొల్లా శంకర్, ఫతేనగర్ డివిజన్ అధ్యక్షులు వెంకటేశ్వరావు, కూకట్పల్లి డివిజన్ అధ్యక్షులు మహేష్, అల్లాపూర్ డివిజన్ అధ్యక్షులు పోలిశెట్టి సురేంద్ర, మూసాపేట్ డివిజన్ జనరల్ సెక్రెటరీ పండుగ సూర్య, జనసేన నాయకులు పసుపులేటి ప్రసాద్ పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-07-at-4.05.41-PM-1024x768.jpeg)