నక్కా వారి పాలెంలో బొమ్మిడి నాయకర్ పాదయాత్ర
- జనంలోకి జనసేన 9వ
నరసాపురం: జనంలోకి జనసేన 9వ రోజు కార్యక్రమంలో భాగంగా నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి, పీఏసీ సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ ఛైర్మెన్ బొమ్మిడి నాయకర్ నరసాపురం నియోజకవర్గం, మొగల్తూరు మండలం, మొగల్తూరు పంచాయతీ, నక్కా వారి పాలెంలో ఇంటింటికీ తిరిగి జనసేన సిద్ధాంతాలు తెలియజేసి అక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకుని, వారికి జనసేన తరపున భరోసా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ గ్రామాలలో డ్రైనేజీ వ్యవస్థ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు, అలాగే సరైన రోడ్లు త్రాగునీరు సమస్య ఎక్కువగా ఉంది, ఇళ్ల స్థలాలు చాలామందికి అర్హత ఉన్న ఇవ్వలేదు ప్రజలు అవస్థలు పడుతున్నారు అని నాయకర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొల్లాటి గోపీకృష్ణ, కోటిపల్లి వెంకటేశ్వరరావు, ఇంజేటి దానం, వలవల నాని, బందెల రవీంద్ర, గుబ్బల మార్రాజు, నిప్పులేటి తారకరామారావు, దూది బాబు, బొక్కా చంటి, ఉప్పులూరి రాంబాబు, లక్కు బాబి, దాసరి కృష్ణాజి, గూడపాటి శ్రీకాంత్, పులపర్తి సూర్యనారాయణ, ఒడుగు ఏసు, గజ్జరపు మురళి వెంకట ఫణి, గుడాలి ఏడుకొండలు, చింతపల్లి రామాంజనేయులు, అందే కొండ, కడలి త్రిమూర్తులు, నల్లి రత్నరాజు, గురుజు తాతాజీ, వాటాల దుర్గారాజు, మోకా ఏడుకొండలు, పిడకల వెంకటరత్నం, సిర్ర ఏసు, ఏలుబండి సాయి బాబు, అందే జగదీష్, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు మరియు నక్కావారి పాలెం ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-07-at-6.45.16-PM-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-07-at-6.45.18-PM-1024x462.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-07-at-6.45.18-PM-1-1024x461.jpeg)