తోలేం గోవిందరాజుని పరామర్శించిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం, కొమరగిరి పంచాయతీ, వెంకటరాయపురానికి చెందిన తోలేం గోవిందరాజు కొంతకాలం కిందట కరెంట్ షాక్ కు గురికావడంతో తన రెండు కాళ్లు 90% అంగవైకల్యానికి గురివడం జరిగింది. అయితే వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉండడంతో స్థానిక జనసైనికులు, పిఠాపురం నియోజవర్గం జనసేన నాయకులు జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ ను కలిసి వారి పరిస్థితిని వివరించడం జరిగింది. ఈ విషయంపై డాక్టర్ పిల్లా శ్రీధర్ స్పందించి, వారి యొక్క కుటుంబాన్ని పరామర్శించి, జరిగిన యాక్సిడెంట్ గురించి, వారు పడుతున్న ఇబ్బందులు గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది. అనంతరం డాక్టర్ పిల్లా శ్రీధర్ మాట్లాడుతూ.. గత రెండు సంవత్సరాలుగా 90% అంగవైకల్యం ఉండి రెండుసార్లు కలెక్టరేట్లో గ్రీవెన్స్ లో కంప్లైంట్ పెట్టుకున్నా గాని తోలేం గోవిందరాజు గారికి న్యాయం జరగలేదని, ఈ వైసీపీ ప్రభుత్వం వికలాంగులను కూడా గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ తిప్పుకోవడం తప్ప 90% అంగవైకల్యం సర్టిఫికెట్ ఉన్నా కూడా వికలాంగు పెన్షన్ ఇవ్వకపోవడం దురదృష్టకరమని, ఈ వైసీపీ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఒక నెలలోపు ఈ బాధిత వికలాంగ కుటుంబానికి న్యాయం చేయాలని, పెన్షన్ మంజూరు చేయాలని ఈ వైసీపీ ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు. లేదంటే జనసేన పార్టీ వైపు నుంచి బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకూ ఎంత దూరమైనా వెళ్తామని జనసేన నాయకుడు డాక్టర్ పిల్లా శ్రీధర్ అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కంద చక్రబాబు, పల్నాటి మధు, వెంకటరాయపురం జనసైనికులు పాల్గొనడం జరిగింది.