అక్రమ లేఅవుట్లపై చర్యలు తీసుకోవాలి: తగరపు శ్రీనివాస్

హుస్నాబాద్ పట్టణంలో అక్రమ లేఅవుట్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ జనసేన కో-ఆర్డినేటర్ తగరపు శ్రీనివాస్ ఆర్డీఓ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పంట పొలాలను కొనుగోలు చేసి, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్లాట్లు పెట్టి, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఇలాంటి అక్రమ లేఅవుట్లు కొనుగోలు చేసిన ప్రజలు, ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ దొరకడం లేదని, అమ్మిన భూమినే మళ్ళీ అమ్మే పరిస్థితి నెలకొందన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులపై, అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ తరపున కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు మల్లెల సంతోష్, లక్కిరెడ్డి హిమవంత్, గుండా సాయి చంద్, సీతా రాజు, ఎల్కపల్లి సంతోష్, వెల్దండి నిఖిల్, మ్యాకల రాజు తదితరులు పాల్గొన్నారు.