క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి: పితాని

ముమ్మిడివరం: ఫిబ్రవరి 10 నుండి 28 వరకు జనసేనపార్టీ చేపట్టబోయే మూడవ విడత జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమం విజయవంతం చేయాలని జనసేన పార్టీ కార్యాలయం వద్ద జరిగిన జనసేనపార్టీ ముమ్మిడివరం నియోజకవర్గ సమావేశంలో పితాని బాలకృష్ణ పిలుపునిచ్చారు. కేవలం 500 రూపాయలు రుసుముతో ప్రమాదంలో మరణిస్తే 5 లక్షల రూపాయలు ప్రమాద భీమా మరియు ప్రమాదంలో గాయపడిన వారికి 50,000 రూపాయలు అందించే ఏకైక పార్టీ జనసేన పార్టీ అని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని అందరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. గతంలో సభ్యత్వాలు చేయించుకున్న వారు మరలా రెన్యువల్ చేయించుకోవాలని తెలిపారు. క్రియాశీలక సభ్యత్వాలు చేసే వాలంటీర్లకు గతంలో సభ్యత్వం చేయించుకున్న వారి వివరాలను అందచేశారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నాయకులు గుద్దటి జమ్మి, గోదశి పుండరీష్, జక్కంశెట్టి పండు, మద్దింశెట్టి పురుషోత్తం, గోలకోటి వెంకన్న బాబు, మోకా బాల ప్రసాద్, అత్తిలి బాబురావు, సానబోయిన మల్లికార్జున రావు, కడలి కొండ, యలమంచిలి బాలరాజు, డాక్టర్ ఆర్.ఎం.పి ప్రసాద్, మాదాల శ్రీధర్, బండారు వెంకన్న బాబు, లంకలపల్లి జమ్మి, గోలకోటి సాయి, మునికోటి జాజి, వేగి ప్రసాద్, పెమ్మిరెడ్డి కోటి, గిడ్డి రత్నశ్రీ, కాయల బలరామ్, యల్లమిల్లి బాబీ గుద్దటి విజయ్, దొరబాబు, గెడ్డం వెంకటేష్, ఇందుగుల రామకృష్ణ, నిమ్మన శ్రీను, సవరపు ప్రసాద్, గంజా శ్రీను, పోతబత్తుల గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.