కాళీపట్నం వెస్ట్ గ్రామ పంచాయితీలో బొమ్మిడి నాయకర్ పాదయాత్ర
నరసాపురం: జనంలోకి జనసేన 10వ రోజు కార్యక్రమంలో భాగంగా నరసాపురం నియోజకవర్గం, మొగల్తూరు మండలం, కాళీపట్నం వెస్ట్ గ్రామ పంచాయితీలో నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి, పీఏసీ సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ ఛైర్మెన్ బొమ్మిడి నాయకర్ ఇంటింటికీ జనసేన పార్టీ సిద్ధాంతాలు తెలియజేసే విధంగా ప్రతీ గడపకు వెళ్లి, అక్కడి ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలు తెలుసుకుని, ఆ గ్రామ ప్రజలకు జనసేన పార్టీ తరపున భరోసా ఇచ్చారు. ఈ గ్రామంలోని ప్రజలు ముఖ్యంగా త్రాగునీటి సమస్యతో మరియు సరైన రోడ్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నాయకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కొల్లాటి గోపీకృష్ణ, ఆకన చంద్రశేఖర్, వలవల నాని, మేడిది సౌజన్య ప్రభాకర్, వాతాడి కనకరాజు, బందెల రవీంద్ర, గుబ్బల మార్రాజు, దూది బాబు, ఉప్పులూరి రాంబాబు, లక్కు బాబి, దాసరి కృష్ణాజి, ఆండ్రాజు నాగరాజు, బళ్ల హనుమంతు, పులపర్తి రాంబాబు, అద్దంకి రాధాకృష్ణ, రమణి చిన్నారి, బర్రె కుమారస్వామి, రావూరి రాజు, పోతుల తాతాజీ మరియు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు మరియు కాళీపట్నం వెస్ట్ గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-08-at-8.23.05-PM-1024x462.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-08-at-8.23.03-PM-1024x462.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-08-at-8.23.05-PM-1-1024x462.jpeg)