డంప్ యార్డ్ ని ఊరుకి దూరంగా తరలించాలని ఎంపీడీఓ కి దరఖాస్తు

ఇచ్చాపురం: ముందు కాలం లో ఎన్నడూ లేని విధంగా ధర్మపురం లో డంప్ యార్డ్ కట్టడం జరుగుతుంది. ఈ డంప్ యార్డ్ మా గ్రామ సమీపంలో కడుతున్నారు మరియు దీని ప్రక్కనే హాస్పిటల్ కడుతున్నారు. ఈ డంప్ యార్డ్ వలన పిల్లలకి చుట్టూ పక్కల ఉన్న ప్రజలకి ప్రాణ హాని చాలా ఉంటుంది. అందువల్ల ఈ డంప్ యార్డ్ ని ఊరుకి దూరంగా తరలించాలని కోరుకుంటూ మా గ్రామస్తులు అందరూ కలిసి జనసేన పార్టీ ఇంచార్జి దాసరి రాజు, రాష్ట్ర జనరల్ సెక్రటరీ తిప్పనా దూర్యోదన రెడ్డి, ఇచ్చాపురం మున్సిపాలిటీ 10వార్డ్ రోకల్లా భాస్కర్, ధర్మపురం గ్రామస్తులు పైల హేమరాజు, ఎంపాడా మొహంతు, పైల పురుషోతం, పిట్ట రామక్రిష్ణ, పైల ఆది, రాములతో కలిసి ఎంపీడీఓ కి దరఖాస్తు ఇవ్వడం జరిగింది.