భోగాపురం భూ నిర్వాసితులకు జనసేన అండగా ఉంటుంది.. లోకం మాధవి

నెల్లిమర్ల: భోగాపురం మండలంలో భూ నిర్వాసిత గ్రామాలైన బొల్లింకాలపాలెం మరియు మారేడుపాలెంలో జరిగిన ఇళ్ల కూల్చివేతపై లోకం మాధవి ధ్వజమెత్తారు. భూ నిర్వాసితులకి కచ్చితమైన హామీ ఇవ్వకుండా వారి ఇళ్ల కూల్చివేత ఎలా సాధ్యం అని కనీసం వారిలో చాలా మందికి ఆర్&ఆర్ ప్యాకేజీ లు కూడా అందకుండా ఎంతో మంది బాధితులు వున్నారు అని మాధవి పేర్కొన్నారు, అక్కడకి వచ్చిన ఆర్.డి.ఓతో మాట్లాడిన మాధవి ఆ ప్రభుత్వం అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. కనీసం ప్రజలకి సమాధానం చెప్పలేకపోతున్న ఆర్.డి.ఓని చూసి ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. మాధవి మాట్లాడుతూ ఒక తల్లి ఆవేదన తననీ ఎంతో మనస్థాపానికి గురిచేసిందని, తన పిల్లల భవిష్యత్తు ఏంటో అర్ధం అవ్వట్లేదని ఈ భూసేకరణ వల్ల తమకి మాట ఇచ్చిన్నట్టు తమకి జాగా కొండగట్టు ప్రాంతంలో ఇచ్చారని, తమకి ఆ స్థలం చదను చేయటానికే ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు అయిపోయాయని ఎంతో బాధపడ్డారు, ఆ ఊరిలో ఉన్న బడి కూల్చడం వలన వారి చదువు పోతుందని గ్రామస్తులు వాపోయారు. భవిష్యత్తులో ప్యాకేజీ రాని వారికి జనసేన నుండి పోరాటం ఎప్పుడూ వుంటుందని మాధవి స్పష్టం చేశారు.