క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభించిన డా.వంపూరు గంగులయ్య

పాడేరు: అరకు పార్లమెంట్ ఇన్చార్జ్ డా.వంపూరు గంగులయ్య పాడేరు జి.మాడుగుల మండల నాయకులతో క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభం చేశారు. ఈ సమావేశంలో నియోజకవర్గ పరిధిలో గల వివిధ మండలాల నుంచి పాల్గొన్న క్రియాశీలక వలంటీర్లకు తగిన సూచనలు సలహాలు ఎదురయ్యే టెక్నికల్ సమస్యలు ఎలా అధిగమించాలి తదితర విషయాలపై అనుభవజ్ఞులచేత సందేహ నివృత్తి చేసారు. ఈ సమావేశంలో ఇన్చార్జ్ గంగులయ్య మాట్లాడుతూ ఆదివాసీ ప్రాంతంలో జనసైనికులు వీర మహిళలు, క్రియా వాలంటీర్లు పాల్గొన్నారు. చక్కటి సమన్వయంతో జనసేన పార్టీ తో ప్రజలను భాగస్వామ్యం చేసేదాంట్లో మీ పాత్ర సమర్థవంతంగా నిర్వర్తిస్తారని కోరుతున్నామన్నారు. జి.మాడుగుల మండల అధ్యక్షులు మసాడి భీమన్న, గౌరవ అధ్యక్షులు త్వ్ రమణ, తల్లే త్రీమూర్తులు, భానుప్రసాద్, గంగ ప్రసాద్, పాడేరు మండల నాయకులు వంతల ఈశ్వర్ నాయుడు, సాలేబు అశోక్, మజ్జి సత్యనారాయణ, వాలంగి ఫునీత్, క్రియా వాలంటీర్లు పాల్గొన్నారు.