క్యాన్సర్ తో బాధపడుతున్న జనసైనికుడికి మాకినీడి భరోసా

పిఠాపురం: యు కొత్తపల్లి మండలం, కొండేవారం గ్రామంలో గొంతు క్యాన్సర్ తో బాధపడుతున్న జనసైనికుడు కేధంశెట్టి మణికంఠను డాక్టర్ మాకినీడి వీరప్రసాద్ వారి ఇంటికి వెళ్లి మణికంఠను పలకరించి, రిపోర్ట్స్ అన్ని పరిశీలించి వారికి మెరుగైన వైద్యం అందే విధంగా చూసుకుంటానని వారి కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మేడిశెట్టి కామేష్, కోన రామకృష్ణ, మేడిచశెట్టు రాజేష్, సంగం రాజా, నాని, గాది శ్రీనివాస్, జనసైనికులు, తదితరులు పాల్గొన్నారు.