పుల్వామా దాడిలో అమరులైన వీర సైనికులకు అశ్రు నివాళులు

సూర్యాపేట జిల్లా కేంద్రాల్లోని జనసేన ఆధ్వర్యంలో జనసేన నాయకులు సంతోష్ బాబు విగ్రహం వద్ద 2019, ఫిబ్రవరి 14న పుల్వామా ఘటనలో అమరులైన జవాన్లకు కొవ్వొత్తుల ర్యాలీతో నివాళులర్పించి, మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో హుజూర్నగర్ కోఆర్డినేటర్ సరికొప్పుల నాగేశ్వరరావు, ఉమ్మడి నల్లగొండ జిల్లా యువజన విభాగ అధ్యక్షులు రామగిరి శివసాయి, సుంకర రవి కిషోర్, గుడిసె గౌతమ్, మోదాల శంకర్, రామ్ భార్గవ్, శంకర్ నాయక్, లింగా నాయక్, అన్వర్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.