ప్రజల సమస్యలపై జనసేన నిరంతరం పోరాటం చేస్తుంది..

ఆత్మకూరు: జనసేన పార్టీ అధ్యక్షులు జనసేనాని పవన్ కళ్యాణ్ సూచనల మేరకు, జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గం ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గం ఉపాధ్యక్షులు దాడి భాను కిరణ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ సంగం మండల నాయకులు అత్తిపాటి కృష్ణ మోహన్ నాయకత్వంలో బుధవారం సిద్ది పురం పంచాయతీ అనసూయ నగర్ గ్రామ పరిధిలో దోమలు ఎక్కువగా ఉండడం వల్ల విష జ్వరాలు సోకుతున్నట్లు అనసూయ నగర్ గ్రామస్తులు జనసేన పార్టీ దృష్టికి తెలియపరచడం జరిగినది. గతంలో సిద్దిపురం పంచాయతీ అనసూయ నగర్ గ్రామంలో డ్రైనేజ్ కాలువలో పూడిక సరిగ్గా తీయకుండా ఉండటం వల్ల మరియు డ్రైనేజ్ నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు వల్ల అనసూయ నగర్ గ్రామ ప్రజలకి విష జ్వరాలు సోకుతున్నాయని జనసేన పార్టీ ఆధ్వర్యంలో సంగం మండలం ఎంపీడీఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగినది. ఈ సమస్యని అధికారులు పట్టించుకోకపోవడంతో నేడు జనసేన ఆధ్వర్యంలో సిద్దిపురం పంచాయతీ అనసూయ నగర్ లో పవర్ స్పేర్ తో జనసైనికులు దోమల మందును డ్రైనేజ్ కాలవల్లో మరియు మురికి కాలువలో కొట్టడం జరిగినది. అదేవిధంగా అనసూయనగర్ గ్రామంలో ఎలిమెంటరీ స్కూల్ ఎదుట పచ్చని చెట్లు పురుగు పట్టడంతో ఆ పురుగు నశించేలా పవర్ స్పేర్ తో మందు కొట్టడం జరిగినది. ప్రజల సమస్యల మీద జనసేన పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసారు. ఈ కార్యక్రమంలో సంగం మండల నాయకులు పత్తిపాటి కృష్ణమోహన్, అనసూయ నగర్ జనసేన పార్టీ నాయకులు నెల్లూరు వెంకటేశ్వర్లు, శేషయ్య, మైనుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.