5 లక్షల భీమా ప్రతి కార్యకర్తకు ధీమా: శివాజి మిరియాల

సత్తుపల్లి: సత్తుపల్లి నియోజకవర్గంలో అడసర్లపాడు గ్రామంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన విభాగ నాయకులు శివాజి మిరియాల ఆధ్వర్యంలో జనసేన పార్టీ క్రియాశీలకు సభ్యత్వపు కార్యక్రమం విజయవంతం చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తల కోసం రూపొందిచిన క్రియాశీల సభ్యత్వం ప్రాముఖ్యతను గురించి వివరించారు.  అదేవిధంగా గతంలో జనసేన సభ్యత్వం తీసుకున్నవారు మరలా రెన్యువల్ చేయించుకోవాలని, కొత్తగా సభ్యత్వం తీసుకోవాలనుకునేవారికి ఇదోక మంచి అవకాశం అని అన్నారు. జనసేన పార్టీ ఇప్పటివరకు ప్రమాదవశాత్తు మరణించిన 96 మంది కార్యకర్తలకు ప్రమాద భీమా కింద 4 కోట్ల, 80 లక్షల రూపాయలు అందించారు. ప్రమాదవశాత్తు గాయపడిన 169 మందికి జనసైనికులకు 60 లక్షల, 90 వేల 781 రూపాయలు అందించారు. మొత్తం 5కోట్ల, 40లక్షల 90వేల 781 రూపాయలు అందజేసిన విషయం గుర్తుచేశారు. కేవలం 500 రూపాయల సభ్యత్వ రుసుముతో ప్రమాదంలో మరణిస్తే 5లక్షల రూపాయల ప్రమాద భీమా, మరియు గాయపడితే 50 వేల రూపాయలు అందించే ఏకైక పార్టీ జనసేన పార్టీ అన్నారు. జనసేన కార్యకర్తలకు ప్రమాదం జరిగితే వారి కుటుంబానికి అండగా ఉండేందుకు ఎంతో ఖర్చుచేసి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇన్సూరెన్స్ కంపెనీ కి పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లిస్తున్నారని, ఈ సందర్భంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  సత్తుపల్లి నియోజకవర్గం విద్యార్థి విభాగ నాయకులు తాళ్లూరు వెంకట కౌశిక్, అనిల్ సూరిశెట్టి, వేంసూర్ మండలం అధ్యక్షులు ఇస్సంపల్లి చక్రధర్ ముఖ్య నాయకులు శివ నరేంద్ర, దండు కరుణ, గోపిరాజు, వీర కృష్ణ, రాఘవులు, చెన్నకేశవులు, వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు.