మొర్రిగూడ గ్రామంలో క్రియా శీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం

అరకు: అరకు నియోజికవర్గంలోని డుంబ్రిగుడ మండలం, గసభ పంచాయితీ, మొర్రిగూడ గ్రామంలో క్రియా శీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించగా మొర్రిగూడ గ్రామ యువకులు కొన్నడి లక్ష్మణ రావు సమక్షంలో క్రియా శీలక సభ్యత్వం పొందారు.. ఈ సందర్భంగా కొన్నడి లక్ష్మణ రావు మాట్లాడుతూ యువకులు పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు ఉత్సాహంతో సభ్యత్వాలు నమోదు చేయించుకున్నారు.రాష్ట్రంలో కవులు రైతుల కుటుంబాలకు అండగా నిలవడమే కాకుండా ప్రతి సమస్యపై ప్రశ్నిస్తూ ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నది ఒక్క జనసేనేనని, సమస్య ఉంటే ప్రజలకు ముందుగా జనసేన పార్టీ గుర్తొస్తుందని, ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి చేసుకునే దిశగా అడుగులు వేయ్యాలని, అదేవిధంగా క్రియాశీలక సభ్యులను దృష్టిలో ఉంచుకొని 500 రూపాయలు వెచ్చించి సభ్యత్వం నమోదు చేసుకున్న వ్యక్తులకు జీవిత బీమా కింద 5 లక్షల రూపాయలు, వైద్య ఖర్చులనిమిత్తం 50 వేల రూపాయలను సభ్యత్వం నమోదు చేసుకున్న వ్యక్తికి అందేలా పవన్ కళ్యాణ్ మన కోసం ఓ మంచి కార్యక్రమాన్ని తీసుకువచ్చారని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పార్టీలో కొత్తగా చేరిన సభ్యులకు, జనసేన పార్టీ అభిమానులకు, స్థానిక ప్రజలకు దిశ నిర్దేశించారు..