మా ప్రాంతం.. మా సచివాలయం.. మన జనసేన

కాకినాడ సిటిలో జనసేన పార్టీ మా ప్రాంతం – మా సచివాలయం – మన జనసేన అనే నినాదంతో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆలోచనలకు అనుగుణంగా ముత్తా శశిథర్ నేత్రుత్వంలో ఆదివారం సాయంత్రం 20వ వార్డు సచివాలయం పరిధిలో ధర్మారావు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సచివాలయ పరిధి ప్రాంత ప్రజలు తమ సమస్యలు చెప్పుకున్నారు. తమకు రేషన్ కార్డుల సరుకులు సమయానికి అందట్లేదని కొంతమంది, రేషన్ కార్డులు తమకు లేవని దీనితో కొన్ని ప్రభుత్వ పధకాలను తాము పొందలేకపోతున్నామన్నారు. ముఖ్యంగా తమకి చొల్లంగిలో ఇళ్ళ స్థలాలు ఇచ్చారనీ అవి ఎక్కడ ఉన్నాయో, ఎప్పుడు పూర్తిచేసి ఇస్తారో తెలియడంలేదని తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చారు. ఈ విషయమై శశిధర్ స్పందిస్తూ తానే ఆయా ప్రాంతాల పరిశీలనకు వెళ్ళాననీ అక్కడ కనీస సదుపాయాలను కూడా అభివృద్ధి చేయడం లేదని ఆందోళన చేసాననీ వారికి గుర్తుచేసారు. వై.సి.పి ప్రభుత్వానికి ప్రజా స్వామ్యం మీద గౌరవం లేదనీ, పేదల సంక్ష్యేమం ఒదిలేసి కుటిల రాజకీయాలు చేయడమే ఈ వై.సి.పి పార్టీకి వచ్చని, పాలనలో ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. తక్షణమే అర్హులైన పేదలకు రేషన్ కార్డులు మంజూరు చేయాలని జనసేన పార్టీ తరపున డిమండ్ చేస్తున్నామని తెలిపారు. ఇవేకాక చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని వీరి సమస్యలపై జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పోరాడతామని స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటి జనసేన పార్టీ సిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మడ్డు విజయ్ కుమార్, ధనుంజయ్, రాజు, వీరబాబు, నాగబాబు, విజయదుర్గా వర్మ, వీరమహిళలు మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.