జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు అవగాహనా కార్యక్రమం

  • జనసేన క్యాలెండర్ ను ఆవిష్కరించిన సరికొప్పుల నాగేశ్వరరావు

హుజూర్ నగర్ నియోజకవర్గం, నేరేడు చర్ల మండలం, జాన్ పహాడ్ రోడ్ లో గల జేపీఎస్ ఆటో యూనియన్ వారికి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ ప్రయోజనాల గురించి హుజూర్ నగర్ నియోజకవర్గ కార్యనిర్వహకులు సరికొప్పుల నాగేశ్వరరావు వివరించారు. కార్యక్రమంలో భాగంగా వారు మాట్లాడుతూ ఈ క్రియాశీలక సభ్యత్వం వలన ప్రమాదవశాత్తు మరణించిన వారికి 5 లక్షల రూపాయలు మరియు గాయపడిన వారికి 50 వేల రూపాయలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. నిత్యం వాహనాలతో ప్రయాణం చేసే వారికి క్రియాశీలక పార్టీ సభ్యత్వం ఎంతగానో ఉపయోగపడుతుందని, పార్టీ ప్రతీ కార్యకర్త కుటుంబానికీ అండగా ఉంటుందని వివరించారు. అనంతరం వారితో కలిసి జనసేన పార్టీ క్యాలెండర్ ను ఆవిష్కరించి క్రియాశీలక సభ్యత్వం నమోదు చేయించారు. ఈ కార్యక్రమంలో సాయి చరణ్, మధు, శ్రీనివాస్ రెడ్డి, నాగరాజు, నరసింహనాయుడు, జహంగీర్, వెంకటేష్, శ్రీను, అంజి జేపీఎస్ ఆటో యూనియన్ సభ్యులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.