క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యాచరణ సమీక్షా సమావేశం
పూతలపట్టు: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కార్యకర్తల కోసం చేపట్టిన క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం విజయవంతం చేయాలని చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఆదేశాల మేరకు పూతలపట్టు నియోజకవర్గంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు మండల అధ్యక్షులు సమావేశమై, మండలంలో ఉన్న క్రియాశీలక వాలంటీర్స్ తొ ప్రతిరోజు మాట్లాడి, దిశా నిర్దేశం చేస్తూ ప్రజలను కలిసే ప్రయత్నం చేయాలని, పార్టీ సిద్ధాంతాలను, పార్టీ భావజాలాలను వివరిస్తూ ప్రజలను పార్టీ వైపు నడిపించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి తులసి ప్రసాద్ మండల అధ్యక్షులు కుమార్, కక్కే పురుషోత్తం, రాజశేఖర్ పాల్గొన్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-22-at-8.24.50-PM-1024x543.jpeg)