జనసేనను ఆదరించండి: రాటాల రామయ్య

  • పవనన్న ప్రజా బాట 68వ రోజు

ఒంటిమిట్ట: కుల మతాలకు అతీతమైన పార్టీ జనసేన పార్టీ అని ఆ పార్టీ రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య తెలిపారు. రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు బుధవారం ఒంటిమిట్ట మండలం పరిధిలోని అచ్చంపేట గ్రామంలో 68వ రోజు పవనన్న ప్రజా బాట కార్యక్రమం నిర్వహించారు. ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.జనసేన పార్టీ రూపొందించిన మేనిఫెస్టో కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాటాల రామయ్య మాట్లాడుతూ… పేద, బడుగు, బలహీన, మధ్యతరగతి కుటుంబాల సంక్షేమమే ధ్యేయంగా జనసేన పార్టీ కృషి చేస్తుందన్నారు. వైసిపి అరాచక పాలనను దృష్టిలో పెట్టుకొని రానున్న 2024 ఎన్నికల్లో జనసేనను ఆదరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.

ఇంటింటా ప్రచారం చేస్తున్న జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య