ఆంధ్రా అభివృద్ధి – జనసేనతోనే సాధ్యం 36వ రోజు

సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, దమ్మయ్య పాలెం గ్రామంలో ఆంధ్రా అభివృద్ధి – జనసేన తోనే సాధ్యం 36వ రోజు కార్యక్రమాన్ని జనసేన పార్టీ నెల్లూరు జిల్లా కార్యదర్శి, ముత్తుకూరు మండల అధ్యక్షుడు మనుబోలు గణపతి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ముత్తుకూరు మండలంలోని, దమ్మయ్య పాలెం గ్రామంలో జనసేన నాయకులు ఇంటింటికీ చేరి కరపత్రాలు పంచారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మనుబోలు గణపతి మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో, ఇప్పుడు వైసీపీ అధికారంలో మన సర్వేపల్లి నియోజకవర్గం నుంచి వ్యవసాయ శాఖ మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించినా కూడా నియోజకవర్గ అభివృద్ధికి నోచుకోలేదు. వ్యవసాయ శాఖ నిర్వర్తిస్తూ ఆ శాఖకి న్యాయం చేయలేకపోయారు. కానీ రైతే రాజు అంటారు, కానీ ఈ ప్రభుత్వంలో ఇన్ని ఆత్మహత్యలు ఎలా జరిగాయి? చనిపోయిన కౌలు రైతులకు ఏం న్యాయం చేయలేకపోయారు, కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు సినిమా రంగంలో సంపాదించిన తన కష్టార్జితాన్ని 3000 మంది చనిపోయిన కౌలు రైతు కుటుంబాలను ఇంటికి లక్ష రూపాయలు చొప్పున ఇచ్చి ఆదుకున్నారు. రైతులకు న్యాయం చేసే ఇలాంటి నాయకుడిని వదులుకున్నామంటే వ్యవసాయ రంగం ఎప్పయికి అభివృద్ధి చెందదు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే లాభసాటిగా వ్యవసాయ రంగం మెరుగైన పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తుందని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నెల్లూరు జిల్లా కార్యదర్శి, ముత్తుకూరు మండల అధ్యక్షుడు మనుబోలు గణపతి తో పాటూ తాండ్ర శ్రీను, సతీష్ గౌడ్ పాల్గొన్నారు.