కొయ్యలగూడెంలో వేగంగా క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం
ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం పట్టణంలో ముమ్మరమైన జనసేన క్రియాశీలక సభ్యత్వాల ప్రక్రియ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు క్రియాశీలక సభ్యత్వాల కార్యక్రమం వేగంగా జరుగుతోంది. అధికార పార్టీ నాయకులు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎంత భయాందోళనలకు గురి చేసినా, ఎన్ని ఆటంకాలు పెట్టినా, పట్టణంలోని యువత, జనసేన కార్యకర్తలు సభ్యత్వాలు తీసుకోవడానికి ముందుకు రావడం శుభపరిణామం. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షలు మాదేపల్లి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు చెప్పుల మధుబాబు, ప్రధాన కార్యదర్శి మేడిన కన్నయ్య, సంయుక్త కార్యదర్శి జగ్గరాజు అప్పలరాజు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-25-at-21.48.21-1-1024x635.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-25-at-21.48.21-1024x571.jpeg)