క్రియాశీలక సభ్యత్వ నమోదు అవగాహనా కార్యక్రమం
పూతలపట్టు: చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డా. హరిప్రసాద్ అదేశాలమేరకు యాదమరి మండల అధ్యక్షులు కుమార్ ఆధ్వర్యంలో జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు అవగాహన కార్యక్రమం 26వ తేదీ ఆదివారం సిద్ధారెడ్డిపల్లి పంచాయితీలో నిర్వహించడం జరిగింది. గ్రామాల్లోని ప్రతి గడపకు చేరుకుని జనసేన సిద్ధాంతాలను, ఆశయాలను తెలియచేస్తూ, 2024 ఎన్నికల్లో జనసేన పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి శివయ్య, యాదమరి మండల అధ్యక్షులు కుమార్, సీనియర్ జనసేన నాయకురాలు శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి, వీరమహిళ శ్రీమతి పుష్ప, మండల ప్రధాన కార్యదర్శిలు రవి కుమార్, వేముల పవన్, యువరాజ్, కార్యదర్శి జెమినీ పాండియన్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-27-at-4.50.50-PM-2-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-27-at-4.50.50-PM-1-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-27-at-4.50.50-PM-1024x487.jpeg)