పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రంలో నీతివంతమైన పాలన: బత్తుల

  • ఆడపడుచులకు బొట్టు పెట్టే కార్యక్రమానికి విశేష స్పందన
  • అడుగడుగునా జన నిరాజనాలతో ఉత్సాహంగా ముందుకు సాగుతున్న కార్యక్రమం
  • ఈసారి ఖచ్చితంగా జనసేన పార్టీకే అవకాశం ఇస్తామంటున్న ప్రజానీకం
  • ప్రజాదరణతో గ్రామంలో ఉదృతంగా కొనసాగిన “మహాపాదయాత్ర”

రాజానగరం, “జనంకోసం జనసేన – మహా పాదయాత్ర” భాగంగా రాజానగరం మండలం, కొండగుంటూరు గ్రామంలో రెండోరోజు జరిగిన కార్యక్రమంలో జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి, జనసేనశ్రేణులు, వీరమహిళలు పెద్ద ఎత్తున పాల్గొని గ్రామంలో ప్రతి ఇంటికి తిరుగుతూ, ఆడపడుచులకు బొట్టు పెడుతూ, ‘గాజు గ్లాసు’ గుర్తుపై ఓటు వేసి, జనసేన పార్టీకి అవకాశం వాళ్ళని ఓటును అభ్యర్థిస్తూ ఉదృతంగా కొనసాగిన ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి పెద్దఎత్తున మద్దతు లభించడం విశేషం. ఈ సందర్భంగా శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి స్థానిక మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలు లేకుండా, తన, పర బేధం లేకుండా, అవినీతి ప్రక్షాళన జరగాలంటే, అవినీతి అక్రమాలపై విస్తృత స్థాయి దర్యాప్తు జరగాలంటే అది జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితేనే సాధ్యపడుతుందని, ఇప్పుడున్న అధికార వైసీపీ ప్రభుత్వం పూర్తిగా ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని, వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అప్పులు కుప్పగా మార్చి రాష్ట్ర ప్రజల భవిష్యత్తును అంధకారంలో నెట్టిందని, ఈ పరిస్థితి నుండి గట్టెక్కాలంటే అది కేవలం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వంతోనే సాధ్యమవుతుందని తెలుపుతూ నియోజకవర్గంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని, నియోజకవర్గ అభివృద్ధి మా జీవిత లక్ష్యమని, ప్రజలందరూ ఈసారి జనసేన పార్టీకి అవకాశం ఇచ్చి, పవన్ కళ్యాణ్ ని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. కొండగుంటూరు గ్రామస్తుల మద్దతుతో అత్యంత ఉత్సాహంగా జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నేతలు, జనసైనికులు, వీరమహిళలు, పెద్దఎత్తున పాల్గొన్నారు.