జనసేన క్రియాశీలక సభ్యత్వం అవగాహనా కార్యక్రమం

పూతలపట్టు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఆదేశాల మేరకు పూతలపట్టు నియోజకవర్గంలోని తవణంపల్లి మండలం నల్లశెట్టిపల్లి పంచాయతీ పరిధిలోని కర్ణంవాండ్లవూరు గ్రామంలోని దళితవాడలో జనసేన క్రియాశీలక సభ్యత్వం అవగాహనా కార్యక్రమం తవణంపల్లి మండలాధ్యక్షుడు శివ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీనియర్ జనసేన నాయకురాలు శ్రీమతి తంబళ్లపల్లి రమాదేవి పాల్గొనడం జరిగింది. అక్కడి వారికి క్రియాశీలక సభ్యత్వం యొక్క ప్రయోజనాలను తెలియజేసి, వారు ఎదుర్కొంటున్న సమస్యలను విని, బడుగు బలహీనవర్గాల అభివృద్ధికి జనసేన పార్టీ ఎల్లప్పుడు కృషి చేస్తుందని, అండగా ఉంటుందని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు వి.పూర్ణచంద్రరావు మరియు జనసైనికులు, వీర మహిళలు పాల్గొనడం జరిగింది.