గాజువాకలో చివరి రోజు జనసేన క్రియాశీల సభ్యత్వం
గాజువాక, జనసేన క్రియాశీల సభ్యత్వ కార్యక్రమం చివరిరోజు శుక్రవారం ఉదయం 10 గంటలకు పాత గాజువాక 60ఫీట్ రోడ్డు ఏ.ఆర్ గ్రాండ్ పక్కన జనసేన పార్టీ యువ నాయుకులు ములకలపల్లి వంశీ ఆధ్వర్యంలో “జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు ” మరియు రెన్యూల్ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిధిగా జనసేన పార్టీ నాయుకులు తిప్పల రమణా రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని సభ్యత్వం చేయించుకోవలసిందిగా కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన వీరమహిళ పత్తి రామలక్ష్మి, కసిరెడ్డి సుజాత, ప్రవీణ్ కుమార్, శ్రీకాంత్, దిలీప్, మరియు క్రియాశీల సభ్యులు, జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-03-at-13.34.58-1024x473.jpeg)