అత్యంత వైభవంగా శ్రీశ్రీశ్రీ సీతారామచంద్రమూర్తి” విగ్రహ ప్రతిష్ట మహోత్సవం

రాజానగరం మండలం, సీతారామపురం గ్రామంలో అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగిన శ్రీశ్రీశ్రీ సీతారామ విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట మరియు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం వేద పండితులచే శాస్త్రోస్తకంగా ఘనంగా జరిగింది. కమిటీ వారి ఆహ్వానం మేరకు రాజానగరం జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మి దంపతులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించి, ప్రజలందరి పైన స్వామివారి కృపాకటాక్షాలు ఉండాలని వేడుకున్నామన్నారు. ఈ ప్రారంభోత్సవ మహోత్సవంలో పెద్దఎత్తున భక్తులు, జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.