నాదెండ్ల మనోహర్ ను మర్యాదపూర్వకంగా కలసిన బత్తుల

రాజానగరం: ఇటీవల వివిధ ప్రమాదాలలో మరణించిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు ఆర్థిక భద్రతను కల్పిస్తూ.. 5 లక్షల రూపాయల బీమా చెక్కులను అందజేసే నిమిత్తం.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటన విచ్చేసిన జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ గౌరవనీయులు నాదెండ్ల మనోహర్ ను రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ రాజమండ్రి షెల్టన్ హోటల్ వద్ద నాయకులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్చం ఇచ్చి పార్టీ అభివృద్ధికి వారు చేస్తున్న విశేషమైన సేవలకు ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు, నియోజకవర్గ నాయకులు జనసైనికులు.