పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు.. స్లాట్ బుకింగ్ నిలిపివేత..
పాత పద్ధతిలోనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ముందస్తు స్లాట్ బుకింగ్లు కూడా రద్దు చేస్తున్నట్టు CS సోమేష్ కుమార్ కార్యాలయం తెలిపింది. ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకుని ఉంటే.. వారికి కేటాయించిన తేదీల్లోనే రిజిస్ట్రేషన్ చేస్తారు.
హైకోర్ట్ ఆదేశాలతో రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మార్పులు చేసింది సర్కార్. ఎవరికీ, ఎలాంటి ఇబ్బంది కలగకూడదనేదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ధరణిపై హైకోర్టు తీవ్ర అభ్యంతరాలు తెలుపుతుండటం..దీంతో స్లాట్స్ బుకింగ్ కూడా నిలిపివేయమని ఆదేశించడంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
సోమవారం నుంచి కార్డ్ పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు జరపాలని నిర్ణయం తీసుకుంది. ఇవాళ జరగాల్సిన సీఎం సమావేశం రేపటికి వాయిదా పడింది. ఇంతకుముందు రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల స్లాట్ బుకింగ్ నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇప్పటివరకు స్లాట్ బుక్ చేసుకున్న వారికి యధావిథిగా రిజిస్టేషన్లు చేసుకోవచ్చిన ఉత్తర్వుల్లో తెలిపింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు స్లాట్ బుకింగ్లు నిలిపివేసున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 21న రిజిస్ట్రేషన్లను పాత పద్ధతిలోనే జరుగనున్నాయి.