పిఠాపురం నియోజకవర్గంలో జనసేనలో చేరికలు

  • జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ మరియు పీఏసీ సభ్యులు పంతం నానాజీ సమక్షంలో జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీలో చేరిన ఎక్స్ సర్పంచులు, ఎక్స్ ఎంపీటీసీలు

పిఠాపురం నియోజకవర్గం, జనసేన పార్టీ నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ ఆధ్వర్యంలో ఆదివారం రాజమండ్రి వి. కన్వెన్షన్ హాల్ లో జనసేన పార్టీ పిఎసి సభ్యులు జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ మరియు పీఏసీ సభ్యులు పంతం నానాజీ సమక్షంలో జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో ఆయన చేతుల మీదుగా పిఠాపురం నియోజకవర్గం నుంచి మొట్టమొదటిసారిగా ఎక్స్ సర్పంచులు, ఎక్స్ ఎంపీటీసీలు పలు గ్రామాల నుండి బలమైన నాయకులు జనసేన పార్టీలోకి చేరిడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పిఠాపురం నియోజకవర్గం సీనియర్ నాయకులు గోకివాడ ఎక్స్ సర్పంచ్ గరగా సత్య నందం, కొండెవరం బిజెపి కొత్తపల్లి మండలం పార్టీ ప్రెసిడెంట్ జీలకర్ర సత్తిబాబు, కందరడ ఎక్స్ సర్పంచ్ బొంతు లచ్చ రావు, కందరడ ఎంపిటిసి కుసుమ సుబ్బారావు, లారీ యూనియన్ ప్రెసిడెంట్ కంద చక్ర బాబు, బి కొత్తూరు ఎక్స్ విద్య కమిటీ చైర్మన్ దుడ్డు రాంబాబు డాక్టర్ పిల్లా శ్రీధర్ ఆధ్వర్యంలో నాదెండ్ల మనోహర్ చేతుల మీదగా జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర మత్స్యకార నాయకులు కంబాల దాసు, బోజ్జ గోపికృష్ణ, పల్నాటి మధుబాబు, మోటూరి మహేశ్వరరావు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.