ఘనంగా జేరిపోతుల సనత్ కుమార్ పుట్టినరోజు వేడుకలు

జయశంకర్ జిల్లా, భూపాలపల్లి, జనసేన పార్టీ నాయకులు జేరిపోతుల సనత్ కుమార్ పుట్టినరోజు వేడుకలను జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందుగా సనత్ కుమార్ తన పుట్టినరోజు సందర్బంగా డా.బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి అంబేద్కర్ ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. అనంతరం జిల్లా కేంద్రంలోని అమృత వర్షిణి అక్షర స్వచ్చంద సేవా సంస్థలోని వృద్దాశ్రమంలో కేక్ కట్ చేసి, వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా సనత్ కుమార్ మాట్లాడుతూ ముందుగా మహిళా లోకానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు. పుట్టినరోజు సందర్బంగా తాగుడు లాంటి చెడు వ్యసనాలను తాను ఎంకరేజ్ చేయననీ, పేద ప్రజలకు, పీడితులకు తనకు తోచిన విధంగా సహాయం చేయడం లాంటి కార్యక్రమాలు మనసుకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయని తెలియజేసారు. కాబట్టి అందరు శాంతి, సేవా మార్గంలో దేశ అభ్యున్నతికై పనిచేయాలని తన పుట్టినరోజు సందర్బంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సనత్ కుమార్ మిత్ర బృందం మరియు తదితరులు పాల్గొన్నారు.