సావిత్రిబాయి పూలేకు నివాళులర్పించిన జేరుపోతుల సనత్ కుమార్
భూపాలపల్లి జయశంకర్ జిల్లా: స్త్రీల విద్యాభివృద్ధి, హక్కుల కోసం కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా వారికి జనసేన పార్టీ జిల్లా నాయకులు జేరుపోతుల సనత్ కుమార్ ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్త్రీల విద్యాభివృద్ధి, హక్కుల కోసం కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే కు ఘన నివాళులు తెలిపుతూ సమాజంలో అసమానతలు మీద అలుపెరగని పోరాటం చేసి, మహిళా హక్కుల కోసం విశేష కృషి చేసిన వీర వనిత అని, మహాత్మ జ్యోతిరావు పూలే అడుగుజాడల్లో నడుస్తూ నిత్యం ఆయన మార్గంలో తోడుగా వున్నారని, మొట్టమొదటి భారతదేశ మహిళ ఉపాధ్యాయురాలుగా, మహిళా అక్షరాస్యులుగా, రచయిత్రిగా ఆమె సేవలు మరువలేనివని కొనియాడారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/jeeva-1024x576.jpg)