ఛలో మచిలీపట్నం.. జనసేన ఆవిర్భావ సభకు తరలిరండి: చాపలమడుగు కాంతారావు

రెడ్డిగూడెంమండల కేంద్రంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు చాపలమడుగు కాంతారావు ముఖ్యనాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 14న జరగబోయే జనసేనపార్టీ పదవ ఆవిర్భావ సభకు ప్రతీ కార్యకర్త, ప్రతి ఒక్క అభిమాని, ప్రతి ఒక్క జనసైనికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. 14 మంగళవారం ఉదయం 9 గంటలకు రెడ్డిగూడెం ప్రధాన కూడలి నందు జెండా ఆవిష్కరణ కార్యక్రమం, మరియు కేక్ కటింగ్ జరుగుతుంది. అనంతరం రెడ్డిగూడెం మండల జనసైనికులు అందరూ కలిసి బైక్ ర్యాలీగా మైలవరం, కొండపల్లి కి చేరుకోని అక్కడినుండి విజయవాడ ఆటోనగర్ కొత్త గేట్ వరకు చేరుకుంటామని చెప్పారు. ద్విచక్ర వాహనాలపై వచ్చే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, సభకి చేరుకొని మరలా ఇంటికి తిరిగి వచ్చే వరకూ జాగ్రత్తలు వహించాలని పరిమిత వేగంతో వాహనాలను నడిపి అందరూ సురక్షితంగా ఇంటికి చేరుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ ఈ సభను విజయవతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాములపాటి సుందరామిరెడ్డి, కొండపల్లి రామకృష్ణ, తోట క్రాంతి బాబు, కొండపల్లి వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.