తీగల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

తిరుపతి జిల్లా, గూడూరు జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం జనసేన పార్టీ పదవ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ తీగల ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం స్థానిక వివేకానంద రోడ్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మచిలీపట్నంలో జరిగిన ఆవిర్భావ దినోత్సవ సభకు జనసేన పార్టీ నాయకులు బస్సులో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు తీగల చంద్రశేఖర రావు మాట్లాడుతూ మచిలీపట్నంలో జరిగిన సభ ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతుందని 2024 ఎలక్షన్ కు సమర శంఖం పూరించబోతున్నారని, 2024లో జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందని తెలిపారు. మచిలీపట్నం వెళ్లేందుకు వాహనాన్ని సమకూర్చిన జనసేన పార్టీ ఎన్.ఆర్.ఐ యు.ఎస్.ఏ తారక శ్రీనివాస్ ఇండ్ల గారికి శిరీష రామిశెట్టి గారికి గూడూరు జనసేన పార్టీ తరపున ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గూడూరు పట్టణ అధ్యక్షులు ఇంద్రవర్ధన్, గూడూరు మండల అధ్యక్షుడు భాస్కర్, చిలుకూరు మండల అధ్యక్షుడు జమాల్ బాషా, కోట వాకాడు చిట్టమూరు నాయకులు విష్ణు, అక్బర్, రాజా, వెంకయ్య, కోటి క్రాంతి, వంశీ, అవినాష్, శివ, గని, వాసు, కార్యకర్తలు మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.