అంధుల పాఠశాలకు జనసేన విరాళం

అమలా పురం: జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ నాయకులు డి.యం.ఆర్.శేఖర్ స్థానిక లూయీ అంధుల పాఠశాలకు 25 వేల రూపాయలను విరాళంగా అందించారు. ఈ విరాళాన్ని అంధ విద్యార్దిని విద్యార్థులకు భోజనాల నిమిత్తం ఖర్చు చేస్తామని పాఠశాల నిర్వాహకులు శ్రీనివాస్ తెలిపారు. జనసేన ఆవిర్భావం నుండీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పూర్తితో ప్రతి యేటా ఇలా సహకరిస్తున్న పార్టీ నాయకులను, కార్యకర్తలను నిర్వాహకులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో శేఖర్, సతీమణి దుర్గా భవాని, దళిత నాయకులు ఇసుకపట్ల రఘుబాబు, లింగోలు పండు, ఆర్.డి.యస్.ప్రసాద్, ఆకుల సూర్యనారాయణ మూర్తి, పోలిశెట్టి బాబులు, కొప్పుల నాగ మానస, డి.యస్.యన్.కుమార్, తిక్కా సరస్వతి, నల్లా వేంకటేశ్వర రావు, పాలూరి నారాయణ స్వామి, నిమ్మకాయల రాజేష్, యర్రంశెట్టి సతీష్, నల్లా దుర్గారావు, సలాది కన్నా మరియు నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.