జనంలో జనసేన కార్యక్రమం పునఃప్రారంభం

పోలవరం నియోజకవర్గంలో జనంలో జనసేన కార్యక్రమం పునఃప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం టి నర్సాపురం మండలంలో తిరుమలదేవిపేట పంచాయతీలో మద్యహానంవారిగుడెం ప్రతి ఇంటికీ వెళ్ళి పలకరించడం జరిగింది. ఈ సందర్భంగా ఇంచార్జ్ చిర్రి బాలరాజు మాట్లాడుతూ ఇకనుండి రెండురోజులు మండలానికి కేటాయిస్తూ ఏడు మండలాలు, అనంతరం మళ్ళీ మొదటి నుండి జనం మద్యలో ఉండేలా కార్యక్రమం రూపుదిద్దడం జరిగింది. ఈ కార్యక్రమం ఇకనుండి ఏ ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా సాగుతుందని బాలరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అద్యక్షులు అడపా నాగరాజు మండల కమిటీ సభ్యులు మరియు జనసైనికులు పాల్గనడం జరిగింది.