రోడ్డును ఏర్పాటు చేయాలని జనసేన డిమాండ్
ఆత్మకూరు నియోజకవర్గం, అనంత సాగరం మండలం, మంచాల పల్లి నుండి పడమటి కంభం పాడు ఇసుక రీచ్ వరకు రోడ్డు చాలా దారుణంగా ఉందని జనసేన పార్టీ మండల అధ్యక్షులు షేక్ మహబూబ్ మస్తాన్ మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తయినా ఇప్పటివరకు రోడ్లను పట్టించుకోవడం చాలా దురదృష్టకరం. రోడ్లు ప్రమాదాలు జరగకుండా అరికట్టడానికి స్థానిక ఉండే నాయకులు, స్థానిక అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి రహదారి భద్రత చర్యలపై దృష్టి పెట్టాలి. అదేవిధంగా రాష్ట్ర రోడ్డు భవనాలు శాఖ మంత్రి దాడిశెట్టి రాజా మరియు స్థానిక ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి వెంటనే స్పందించి ఆత్మకూరు నియోజకవర్గం నుండి సోమశిల వెళ్ళే ప్రధాన రహదారి మంచాలపల్లి గ్రామం నుండి పడమటి కంభంపాడు ఇసుక రీచ్ వరకు రోడ్డును ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి కాకి జాషువా, మండల కార్యదర్శి చిన్నయ్య పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-20-at-16.29.29-612x1024.jpeg)