డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో జనసేన ప్రజా సంకల్ప యాత్ర

విశాఖ దక్షిణ నియోజకవర్గం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ఈనెల 22న విశాఖలో పూర్ణ మార్కెట్ దుర్గాలమ్మ గుడి నుంచి జనసేన ప్రజాసంకల్పయాత్ర నిర్వహిస్తున్నట్లు జనసేన దక్షిణ నియోజకవర్గం నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు తెలిపారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రజా సమస్యలపై జనసైనికులు పోరాటం చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనసేన నిరంతరం పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఈనెల 22న బుధవారం ఉదయం 8:30 గంటలకు జనసేన ప్రజాసంకల్ప యాత్రను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు, అలాగే జనసేన అధికారంలోకి వస్తే ప్రజలకు చేసే మంచిని వివరించేందుకు ఈ యాత్రను చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. 35వ వార్డు మొత్తం ఈ యాత్ర కొనసాగుతుందని అన్నారు. అలాగే నియోజకవర్గ మొత్తం కూడా యాత్రను చేపడుతున్నట్లు వెల్లడించారు. జన సైనికులు, వీర మహిళలు ఈనెల 22న ఉదయం ఎనిమిది గంటలకు దుర్గాలమ్మ గుడి వద్దకు రావాలని ఆయన కోరారు.