ఊరు-వాడ జనసేన పార్టీ కార్యాచరణ సమావేశం

మంత్రాలయం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి స్థానంలో చూడాలనే కోరికతో మంత్రాలయం నియోజకవర్గ పరిధిలోని పలు మండలాల్లో గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా ఊరు-వాడ జనసేన పార్టీ అనే కార్యక్రమం ఏర్పాటు చేయాలనే ఉద్దేశ్యంతో, జనసేన కార్యకర్తలు, నాయకులు సమావేశమై ఊరు-వాడ జనసేన పార్టీ కార్యక్రమ కర్యాచరణ నిమిత్తం చర్చించడం జరిగింది. అందుకు అనుగుణంగా ప్రతి ఒక్క జనసైనికుడు ముందుకు రావాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన నాయకులు పొంత నరసింహులు సమక్షంలో హోటల్ రమేష్, చింతలగేని, వీరారెడ్డి, నాగేష్, కోసిగయ్య, చింతకుంట రజాబ్వలి, శేఖర్, అంజి, సూరి, నాగేంద్ర, నరసింహులు, పరమేష్, కరీం, వరుణ్, మంజునాథ్, తిమ్మారెడ్డి మొదలగువారు పాల్గొన్నారు.