ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభంలో పాల్గొన్న పంతం నానాజీ

కాకినాడ రూరల్ మండలం, రమణయ్యపేట గ్రామం, రాయుడు పాలెం ప్రాంతం తదేకం ఫౌండేషన్ వారి సహకారంతో జనసేన పార్టీ నాయకులు తాటికాయల వీరబాబు అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని జనసేన పార్టీ పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంఛార్జి పంతం నానాజీతో కలిసి ప్రారంభించిన తదేకం ఫౌండేషన్ సభ్యులు మాదవి, సుధ. ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ అవతార్ బాబాజీ తదేకం ఫౌండేషన్ ద్వారా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, ఈ ఉచిత కుట్టు మిషన్ కేంద్రాన్ని ప్రారంభించడానికి స్థలం ఏర్పాటు చేసిన జనసేన నాయకులు బుజ్జికి, తదేకం ఫౌండేషన్ కాకినాడ రూరల్ ప్రతినిధి శాండీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ఉచిత కుట్టు మిషన్ కేంద్రం ద్వారా మహిళలు తమ కాళ్ళ మీద వేరు నిలబడేందుకు ఎంతో దోహద పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల, గ్రామ స్థాయి నాయకులు, వీరమహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.