జనసేనను ఆదరించండి: మలిశెట్టి వెంకటరమణ

రాజంపేట, కుల మతాలకు అతీతమైన పార్టీ జనసేన పార్టీ అని రాజంపేట అసెంబ్లీ జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ పేర్కొన్నారు. శుక్రవారం ఒంటిమిట్ట మండల పరిధి మండపంపల్లి పంచాయతీ అమ్మవారి పల్లె, పలు గ్రామాల్లో 73వ రోజు పవనన్న ప్రజా బాట కార్యక్రమం నిర్వహించారు. ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జనసేన పార్టీ రూపొందించిన మేనిఫెస్టో కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మలిశెట్టి వెంకటరమణ మాట్లాడుతూ పేద బడుగు, బలహీన, మధ్యతరగతి కుటుంబాల సంక్షేమమే ధ్యేయంగా జనసేన పార్టీ కృషి చేస్తుందన్నారు. వైసిపి అరాచక పాలనను ప్రజలు దృష్టిలో పెట్టుకొని రానున్న 2024 ఎన్నికల్లో జనసేనను ఆదరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య, జనసేన వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.