పవనన్న ప్రజా బాటకు విశేష స్పందన

★ డాక్టర్ కందుల ఆధ్వర్యంలో కొనసాగుతున్న కార్యక్రమం
★ 31, 32, 33 వార్డులలో అనూహ్య స్పందన

విశాఖ, జనసేనతోనే అభివృద్ధి సాధ్యమని దక్షిణ నియోజకవర్గ జనసేన నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు. డాక్టర్ కందుల నాగరాజ్ ఆధ్వర్యంలో దక్షిణ నియోజకవర్గంలో చేపట్టిన పవనన్న ప్రజా బాట కార్యక్రమం మూడో రోజుకు చేరుకుంది. 31, 32, 33 వార్డులలో ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. గొల్లల పాలెం, రెడ్నం గార్డెన్, ప్రకాశరావు పేట, ఉమెన్స్ కాలేజీ ప్రాంతాలలో ప్రజలు హారతి ఇచ్చి స్వాగతించారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ జనసేన పార్టీకి క్షేత్రస్థాయిలో అనూహ్యస్పందన వస్తుందని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీ బలోపేతానికి అవిరల కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రభుత్వ పాలనపై ప్రజలందరూ వ్యతిరేకంగా ఉన్నారని చెప్పారు. అధికార మార్పును ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత కచ్చితంగా అధికార మార్పు జరగడం ఖాయమని స్పష్టం చేశారు. తాము చేపట్టిన పవనన్న ప్రజా బాట కార్యక్రమానికి దక్షిణ నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలలోనూ ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం జనసేన సైనికులు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.