“ఆంధ్రా అభివృద్ధి – జనసేనతోనే సాధ్యం” 40 వ రోజు
నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లి గూడూరు మండలం, వరకవిపూడి గ్రామంలో “ఆంధ్రా అభివృద్ధి – జనసేనతోనే సాధ్యం” 40 వ రోజు నిర్వహించడం జరిగింది. ఆంధ్రా అభివృద్ధి జనసేనతోనే సాధ్యం కార్యక్రమంలో భాగంగా తోటపల్లి గూడూరు మండలంలోని, వరకవిపూడి గ్రామంలో జనసేన నాయకులు ఇంటింటికీ చేరి కరపత్రాలు పంచారు. జనసేన నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో నిత్యావసర ధరలు తగ్గాలన్నా, రాష్ట్రాభివృద్ధి జరగాలన్నా, యువతకి ఉద్యోగ అవకాశాలు రావాలన్నా రాబోయే సాధారణ ఎన్నికల్లో జనసేన పార్టీ గుర్తు “గాజుగ్లాస్” కి ఓటు వేసి జనసేన పార్టీకి అధికారం ఇవ్వండి, పవన్ కళ్యాణ్ సీఎం అయ్యేలా దీవించండి అని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నెల్లూరు జిల్లా కార్యదర్శి, మనుబోలు గణపతి పిలుపుతో నిర్వహించడం జరిగింది. వలిపి శ్రీకాంత్, తాండ్ర శ్రీను, తిరుమల తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-26-at-16.07.20-1024x575.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-26-at-16.07.21-1024x574.jpeg)