పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా టీమ్ పికె ఎడిటర్స్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమాని జనసేన పార్టీ ఏర్పడినప్పటి నుండి బాధ్యతాయుతమైన జనసైనికుడిగా మారి పవన్ కళ్యాణ్ కోసం నేను ఏమి చేయగలను మరియు ఈ విప్లవంలో నేను ఎంతవరకు భాగం కాగలను అనే ఆలోచనతో మా టీమ్ పికె ఎడిటర్స్ ప్రయాణం అక్టోబర్ 13, 2020 నుండి ప్రారంభించడం జరిగింది. టీమ్ పికె ఎడిటర్స్ వ్యవస్థాపకుడిగా అజిత్ కుమార్ అనే నేను నాతో సహా 3 మంది సభ్యులతో కలసి ప్రారంభించబడింది. రెండున్నరేళ్ల ఈ ప్రయాణంలో ఎవరి నుంచి ఏమీ ఆశించకుండా జనసేన కార్యకలాపాలను, సిద్ధాంతాలను ప్రచారం చేయడమే లక్ష్యంగా ఎందరో సంపాదకులను దారిలో చేర్చి గ్రూప్గా ఏర్పాటు చేయడం జరిగింది. మేము అంతా ఒక్క రూపాయి ఆశించకుండా నిస్వార్థంగా పనిచేసే జనసైనికులం. టీమ్ పికె ఎడిటర్స్ మొదలపెట్టక ముందు వరకు కూడా అందరం కలసి పని చేసేవాళ్ళం, ఇప్పుడు మేము 100 మందికి పైగా ఎడిటర్లుగా ఉన్నాము, వారు మన జనసేన పార్టీ కోసం ఎల్లప్పుడూ పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు, పవన్ కళ్యాణ్ కోసం జనసేన పార్టీ కోసం మా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు కష్టపడుతూనే ఉంటామని, గత కొన్ని సంవత్సరాలుగా కష్టపడుతూ నాకు తోడుగా పార్టీకి అండగా ఉన్న టీమ్ పికె ఎడిటర్స్ మరియు జనసైనికులకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. సేనాని పవన్ కళ్యాణ్ ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూసే వరకు మేము దీన్ని కొనసాగిస్తామని ప్రమాణం చేస్తున్నామని అజిత్ కుమార్ తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/20221023_133513-1024x1024.jpg)